- Advertisement -
నవతెలంగాణ ఆర్మూర్
ఆలూర్ మండల కేంద్రంలో కొత్తగా మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ)గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన రాజలింగంను సోమవారం ఘనంగా సన్మానించినారు.. ఈ సందర్భంగా ఆలూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్, కాంగ్రెస్ నాయకులు రాజలింగంకు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యుడు భాస్కర్, కాంగ్రెస్ నాయకులు వెల్మ గంగారెడ్డి, బీరయ్య, రాము, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -