Thursday, June 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబేద్కర్ విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలి

అంబేద్కర్ విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలి

- Advertisement -

విగ్రహావిష్కరణ పనులను పరిశీలించిన కమిటీ నాయకులు
నవతెలంగాణ – తాడ్వాయి 

మండల కేంద్రములోనీ బస్టాండ్ ప్రాంగణం లోజూన్ 12న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ నాయకులు అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ .. బాబాసాహెబ్ అంబేద్కర్  విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, మేధావులు, కవులు, కళాకారులు , మహిళలు, విద్యార్థులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  కమిటీ అధ్యక్షులు బండారి చంద్రయ్య ,ప్రధాన కార్యదర్శి వావిలాల రాంబాబు, మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజు ,మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరెం లచ్చు పటేల్, మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్, కార్యదర్శి  గజ్జల రాజశేఖర్, శ్రీకాంత్, ఇర్ప శ్రీను, కంది సమ్మయ్య ,ఇర్ప వెంకటేశ్వర్లు, వెట్టి రమేష్, మైపాల్ రెడ్డి , లక్ష్మి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -