కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం
జులై 9న జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ – జన్నారం : జన్నారం మండలంలో తెలంగాణ బీడి & సిగార్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) సమావేశం ఆదివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో దాసండ్ల రాజన్న అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంకు దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తరువాత బీడీ పరిశ్రమ అతి పెద్దది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమను కాపాడాల్సిన కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆ పరిశ్రమను ధ్వంసం చేయడానికే కోస్టా చట్టం-2023ని తీసుకొచ్చింది. బీడీ కార్మికుల ఉపాధిని హరించే ఈ చట్టాన్ని ఉపసంహరించు కోవాలని సిఐటియు డిమాండ్. చేస్తున్నది. కోటపా చట్టం- 2023 ప్రతిపాదించిన సవరణల ప్రకారం బీడీ కట్టలపై ఉత్తర్వుల గురించి ఉత్పత్తిదారులు ప్రచారం చేసుకోరాదు. బీడీ కట్టలు పబ్లిక్ దుకాణాల్లో ఉండరాదు. 20సం||రాల కంటే తక్కువ వయసున్న వారికి బీడీలు అమ్మడానికి వీలులేదు. లూజుబీడీలు అమ్మడానికి వీలులేదు. కట్టలు మాత్రమే అమ్మాలి. బీడీ కట్టలలో బీడీల సంఖ్యను ప్రభుత్వం నిర్దేశిస్తుంది. ఈ సవరణలు అమలు జరిగితే బీడీ అమ్మకాలుతగ్గి, కార్మికులకు ఉపాధి పోతుంది. ఇది పెద్దసంక్షోభానికి దారి తీస్తుంది. కాబట్టి కోపా చట్టం
సవరణలను ఉపసంహరించుకోవాలని లేదంటే కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10సం॥లు గడుస్తున్నది. 3వ సారి కూడా అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నది. అందుకే కేంద్ర ప్రభుత్వంపై పెద్దఎత్తున ఒత్తిడి తెచ్చి KOTPచట్టం-2023ను ఉపసంహరించుకోవాలి. బీడీ వెల్ఫేర్ సెస్సు యాక్ట్ను పునరుద్ధరించాలని, కనీస పెన్షన్ ఇవ్వాలని 2025 జూలై 9న దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో బీడీ కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ అంబాల లక్ష్మణ్, బుచ్చన్న సీఐటీయూ సీనియర్ నాయకులు, బీడీ కార్మికులు లక్ష్మి,సరస్వతి, సుజాత సరిత లత సువర్ణ, లావణ్య సత్తవ్వ తదితరులు పాల్గొన్నారు.