- Advertisement -
న్యూఢిల్లీ : ప్రముఖ టెక్ కంపెనీ హెచ్సిఎల్ టెక్ తమ బోర్డులోకి కొత్తగా నీతి అయోగ్ మాజీ సిఇఒ అమితాబ్ కాంత్ను తీసుకున్నట్లు ప్రకటించింది. ఐదేళ్ల కాలపరిమితితో సెప్టెంబర్ 2030 వరకు స్వతంత్ర డైరెక్టర్గా ఆయన తమ కంపెనీలో కొనసాగుతారని వెల్లడించింది. అమితాబ్ నియామకానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని సోమవారం రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది.
- Advertisement -