కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఎ 2016(తెలుగు) చేస్తున్న కాలంలో పాఠ్యంశాలతో పాటు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు అధ్యయనం చేయటం అనాడే అలవర్చుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన కళాకారులు డాక్యుమెంటేషన్ ప్రాజెక్టు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో ప్రాజెక్ట్ ఫెలోగా ఆచార్య బట్టు రమేష్ గారి దగ్గర చేరింది కుంజ వరలక్ష్మి. గిరిజన గ్రామాలు పర్యటించినపుడు తన అస్తిత్వాన్ని చాటుకోవాలని పట్టెడ కోయ సంస్కతి సంప్రదాయాలపై అధ్యయనం చేసారు. అదే అంశంపై ఆచార్య బట్టు రమేష్ పర్యవేక్షణలో దగ్గర 2021 – 2024లో ఏం ఫీల్ జాయినై పూర్తి చేసారు.
గిరిజనుల మౌఖిక సాహిత్యం గేయాలు కథలు, సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు వంటివెన్నో దాని చెలిమిలో ఊరుతుంటాయి. వాటి అందచందాలు గిరిజ నేతర సమాజాలకు తెలియ వలసిన అవసరం ఉంది. అక్షర గ్రంథం లేని కొండకోనల్లో గిరిజనులు అల్లే నోటీసాహిత్య పరిమళాలు విశ్వవ్యాప్తం అవ్వాలంటే పరిశోధనల ద్వారానే సాధ్యమవుతుంది. కనుక విశ్వవిద్యాలయాలలో విస్తతమైన పరిశోధనలు జరగాలి, వాటన్నిటిని నిక్షిప్తం చేయాలి. అంతే కాకుండా గ్రంధాలను వెలుగులోకి తీసుకరావలసిన అవసరం ఉంది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 35 గిరిజన తెగలున్నాయి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో 12 తెగలున్నాయని అంచనా. వారందరి వేషభాషలు, సంస్కతి, సంప్రదాయాలు విలక్షణమైనవి. వారి జీవన విధానం, ఆచార వ్యవహరాలు వైవిధ్య భరితంగా ఉంటాయి. అయితే కుంజ వరలక్ష్మి తన పరిశోధనను ఈ కోణంలోనే మొదలు పెట్టి తగిన పద్దతులను అనుసరించారు. ఎంపిక చేసుకున్నటువంటి ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలలో ఉన్న గ్రామాల్లో పరిశోధనకు సంబంధించిన అంశాలకి సంబంధించిన ప్రశ్నావళితో అక్కడివారిని కలిసి వారితో మమేకమై కావల్సిన మౌఖిక విజ్ఞానాన్ని, సంస్కతిని, సాహిత్యాన్ని తెలుసుకోగలిగింది వరలక్ష్మి
ఈ సిద్ధాంత వ్యాసాన్ని నాలుగు అధ్యయనాలలో రూపొందించుకొని పరిశీలన చేశారు. దీనిలో మొదటి రెండు అధ్యయనాలలో భారతదేశం జాతులు, ఉప జాతుల పరిచయం, పట్టెడ కోయ సామాజిక నిర్మాణం, నిర్వచనం, వర్గీకరణ వ్యాప్తిని తెలియజేశారు. మూడవ అధ్యాయంలో పట్టెడ కోయ జీవన విధానం, నాలుగో అధ్యాయంలో పట్టెడ కోయ మౌలిక సాహిత్యం, ఆచారాలు, సంస్కతి, సాంప్రదాయాలు, కోయల సాంఘికాచారాలను చెప్పారు.
ఈ విభజన ద్వారా పట్టెడ కోయలంటే ఎవరు? వారి సంస్కతి సంప్రదాయాలేమిటీ? అనే విషయాలను తెలపటం ఈ పరిశోధన గ్రంథంలో ప్రధాన లక్ష్యంగా తెలుస్తుంది. పట్టెడకోయ సంస్కతి సంప్రదాయాలన్నీ, అందలి సౌందర్యాన్ని, ఆ సాహిత్యం చుట్టూ పరచుకున్న సామాజిక, ఆర్థిక, సంస్కతిక విశేషాలను మనకు అందించే ప్రయత్నం చేసి అందులో కొంతవరకు విజయవంతం అయింది వరలక్ష్మి.
సేకరించిన విషయాల్లో సంస్కతి సంప్రదాయాలు, ఆయా ప్రాంతాల్లోని కొయ తెగల ప్రత్యేకతని, విభిన్న జీవనశైలిని తెలుపుతున్నాయి. జానపద సాహిత్యం తీరుగానే పట్టేడ కోయ మౌఖిక సాహిత్యం దాదాపుగా అవే లక్షణాలను కలిగి ఉన్నాయి అంటారు వరలక్ష్మి.
పరిశోధన ఆత్మగతమైందే కావచ్చుకాని దాని ఫలాలు మాత్రం సమాజగతం. కాబట్టి వ్యక్తిగతమైన ఇష్టాఇష్టాలు, పక్షపాతం, మమకారాలకు లొంగని పరిశోధకురాలు చెప్ప వలసిన విషయాలను దాచవద్దు. మంచి చెడులను తుంచాలి, వాస్తవాన్ని నిక్కచ్చిగా వెల్లడించాలి, అప్పుడే అది ఉత్తమ పరిశోధనగా నిలబెడుతుంది. వాటికి తోడు సరియైన పద్దతులను పాటించిన వరలక్ష్మి కోయ తెగ విజ్ఞానం పట్టేడ కోయ సంస్కతి, సాహిత్యం, సాంప్రదాయాలు ఒక జీవన నది వంటిది.
ఎన్ని తరాలైనా ఇనికిపోని మౌఖిక సంపద వారి సొంతం. నిజానికి వాటిని సష్టంచేది ఆదివాసీలే అయినా ఆ సంస్కతిలోని మాధుర్యం, సౌందర్యం ప్రతి ఒక్కరూ ఆస్వాదించదగ్గది. ఏదిఏమైనా ఆదివాసి గిరిజన సమాజంలో అనేక సంస్కతి, సంప్రదాయాలు, సాహిత్యం, ప్రత్యేక అలవాట్లు, అచారాలుగల పట్టేడకోయ బిడ్డల జీవన సౌందర్యాన్ని ప్రపంచం ముందుంచే ప్రయత్నం చేసి పుస్తక రూపంలో తీసుకొస్తున్న కుంజ వరలక్ష్మి బాధ్యత పరిశోధన చేసి ఎంపిల్ డిగ్రీ పట్టా పొందటంతో అయిపోలేదు. నిరంతరం ఈ విషయంపై తాను పనిచేస్తుండాల్సిందే. ఈ గ్రంధాన్ని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ముద్రిస్తున్నందుకు అభినందనలు, వరలక్ష్మికి శుభాకాంక్షలు.
– శోభరమేష్, 8978656327