Monday, July 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంటీం ఇండియాలోకి ఊహించని ప్లేయర్.!

టీం ఇండియాలోకి ఊహించని ప్లేయర్.!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హర్యానా ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌ను ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో నాల్గవ టెస్టు మ్యాచ్ కోసం భారత జట్టులో చేర్చారు. ఈ వార్తతో అన్షుల్ కుటుంబ సభ్యులు మరియు అతని కోచ్ సంతోషంతో ఉప్పొంగిపోయారు. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ మరియు ఆకాశ్ దీప్‌లు గాయపడడంతో ముందు జాగ్రత్తగా అన్షుల్ కాంబోజ్ ను ఎంపిక చేశారు. అర్షదీప్, ఆకాశ్ దీప్ నాల్గవ టెస్టులో ఆడేది సందేహమే. అన్షుల్ సోదరుడు సన్యమ్ కాంబోజ్ ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “మేము చాలా సంతోషంగా ఉన్నాం. అన్షుల్ భారత జాతీయ జట్టుకు ఎంపికవడం పట్ల మొత్తం కుటుంబం ఆనందిస్తోంది. అతని ఎంపికపై నా సంతోషాన్ని వ్యక్తం చేయడానికి మాటలు సరిపోవు. అతను అకాడమీలో చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసేవాడు, ఇంటికి కేవలం నిద్రించడానికి మాత్రమే వచ్చేవాడు” అని వెల్లడించారు. ఈ సంతోషకరమైన సందర్భంలో అన్షుల్ కాంబోజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నామని, అతను టీమ్ ఇండియాకు మరిన్ని విజయాలను అందిస్తాడని ఆశిస్తున్నామని సోదరుడు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -