Sunday, June 1, 2025
E-PAPER
Homeజాతీయంసుప్రీం జడ్జీలుగా అంజారియా,బిష్ణోరు, చందూర్కర్‌ ప్రమాణస్వీకారం

సుప్రీం జడ్జీలుగా అంజారియా,బిష్ణోరు, చందూర్కర్‌ ప్రమాణస్వీకారం

- Advertisement -

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జీలుగా జస్టిస్‌లు ఎన్‌వి అంజారియా, విజరు బిష్ణోయి, ఎఎస్‌ చందూర్కర్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ఈ ముగ్గురి చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బిఆర్‌ గవాయి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు జడ్జీల్లో సగం మంది హాజరయ్యారు. కొత్త న్యాయమూర్తుల రాకతో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 34కు చేరుకుంది. అయితే జూన్‌ 9న జస్టిస్‌ బేలా ఎం. త్రివేది పదవీ విరమణ చేయనున్నారు. న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేసిన తరువాత సిజె గవారు వారితో కరచాలనం చేసి స్వాగతించారు. జస్టిస్‌ బిష్ణోరు హిందీలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ ముగ్గురి పేర్లను ఈ నెల 26న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ అంజరియా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ విజరు బిష్ణోరు, బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ చందూర్కర్‌లను సుప్రీంకోర్టు జడ్జీలుగా కొలీజియం సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం కేవలం మూడు రోజుల్లోనే అంటే ఈ నెల 29న వీరి నియామానికి ఆమోదం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -