- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత్లో టీ20 వరల్డ్కప్ ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరాకరించడంతో, ఆ దేశ క్రీడా జర్నలిస్టులకు ఐసీసీ వరల్డ్కప్ మ్యాచ్ల కవరేజీకి అనుమతి నిరాకరించింది. వందకుపైగా దరఖాస్తులను తిరస్కరించడంతో, తమ బోర్డు తప్పిదానికి తమను శిక్షించవద్దని జర్నలిస్టులు వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీడియా అక్రిడిటేషన్స్ను మరోసారి పరిశీలిస్తామని ఐసీసీ వెల్లడించింది. భద్రతా కారణాలు చూపి భారత్లో ఆడబోమని పంతం పట్టిన బంగ్లాదేశ్కు బదులుగా స్కాట్లాండ్కు ఐసీసీ అవకాశమిచ్చింది.
- Advertisement -



