- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఐదుగురు మహిళా కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమక్షంలో వారంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
- Advertisement -



