- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. గల్ఫ్ ఎయిర్ లైన్స్ వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్పోర్టు సిబ్బంది విమానాశ్రయంలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబు లేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



