- Advertisement -
కుకనార్: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కుకనార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో బుధవారం సాయంత్రం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్లుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. పలువురు గాయపడినట్టు సమాచారం. ఘటన స్థలంలో భారీగా ఆయుధాలు, సామగ్రిని స్వాధీనం బలగాలు చేసుకున్నట్టు భద్రత బలగాలు తెలిపాయి. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -