ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్ : మావోయిస్టు ప్రభావిత ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకున్నది. నారాయణపూర్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి.సుందర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మావోయిస్టు మాడ్ డివిజన్కు చెందిన పెద్ద క్యాడర్ ఉన్నదన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో అబూజ్మడ్ ప్రాంతంలో ఆపరేషన్ జరిపారు. నారాయణ్పూర్, కొండగావ్ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్(డీఆర్జీ), స్పెషల్ టాస్క్ఫోర్స్(ఎస్టీఎఫ్) కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ను నిర్వహిం చారు. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు చనిపోయారు. వారి మృతదేహాలతో పాటు ఆయుధాలనూ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారులు చెప్పారు.
పలు ఎన్కౌంటర్లలో 400 మందికి పైగా మావోయిస్టులు మృతి
గతేడాది జనవరి నుంచి ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలు జరిపిన పలు ఎన్కౌంటర్లలో 400 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఏడాది మే 21న జరిగిన ఎన్కౌంటర్లో సీపీఐ(మావోయిస్టు) జనరల్ సెక్రెటరీ నంబాల కేశవ రావు అలియాస్ బసవరాజు (70) మృతి చెందటంతో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిన విషయం విదితమే. ఈ ఎన్కౌంటర్లో ఆయనతో పాటు 27 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఘటన విషయంలో మోడీ సర్కారుపై పౌర సమాజం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆపరేషన్ కగార్తో మావోయిస్టులను అంతమొందించాలన్న లక్ష్యంతో కేంద్రంలోని మోడీ సర్కారు వ్యవహరిస్తున్నది. ఇదే విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఇటీవల ఛత్తీస్గఢ్ పర్యటనకు వచ్చిన ఆయన.. ఇదే విషయాన్ని చెప్పారు. ఈ ఏడాది వర్షాకాలంలోనే మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు జరుగుతాయని వివరించారు. కేంద్రం ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలనీ, మావోయిస్టులతో చర్చలు జరపాలని పౌర సమాజం సూచనలు చేస్తోన్న విషయం విదితమే.
ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్
- Advertisement -
- Advertisement -