నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు ఏర్పాటు చేసేందుకు ఎయిర్ఫోర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రామగుండం, కొత్తగూడెంలో ఎయిర్పోర్టుల నిర్మాణం సాధ్యం ఇటీవల ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. వరంగల్ఎయిర్పోర్టుకు అదనంగా మరో రూ.140 కోట్లు అవసరం అవుతాయని అధికారుల నివేదికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. త్వరలోనే నిధులు విడుదల కానున్నాయి.
తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ఎయిర్పోర్టు ఒక్కటే ఉంది. వరంగల్ఎయిర్పోర్టుఎన్వోసీ జీఎంఆర్ సంస్థ ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నించి సఫలమైంది. దీంతో ఎయిర్పోర్టుఆథారిటి ఆఫ్ ఇండియా నిధులు కేటాయించి విమానాశ్రయాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ముందుకొచ్చింది. ఆదిలాబాద్లో ఏర్పాటు చేయనున్న ఎయిర్పోర్టునుఎయిర్ఫోర్స్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి వినియోగించుకోనుంది. దీనిపై ఎయిర్పోర్టుఆథారిటీ ఆఫ్ఇండియా, ఎయిర్ఫోర్స్, పౌరవిమానయాన శాఖ అధికారులతో చర్చించారు. దీనికి కేంద్రం సైతం ఒకే అని చెప్పింది.