- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం.. మరో కొత్త పథకం ప్రవేశపెట్టనుంది. తెలంగాణలో ‘బాల భరోసా’ పేరుతో మరో కొత్త పథకం తీసుకురానుంది రేవంత్ ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ఐదేళ్ల లోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉంటాయని తెలిపారు మంత్రి సీతక్క. ‘బాల భరోసా’ కొత్త పథకం కింద అవసరమైతే ఉచితంగా శస్త్రచికిత్సలు చేయబడతాయని వెల్లడించారు మంత్రి సీతక్క. సచివాలయంలో నిన్న జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో వివరించిన మంత్రి సీతక్క.. ఈ ‘బాల భరోసా’ పై ప్రకటన చేశారు.
- Advertisement -