- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య పాల్పడింది. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న మైనర్ హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయిందని స్టేషన్ హోస్ ఆఫీసర్ అర్వింద్ భరద్వాజ తెలిపారు. నీట్ కోసం ఇటీవలె కోటాకు వచ్చిందని, పరీక్ష ముందు రోజే ఆమె ఆత్మహత్య పాల్పడిందని అధికారులు చెప్పారు. గతంలో కూడా పలువురు విద్యార్థులు ఒత్తిడి భరించలేక బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో మైనర్ ఆత్మహత్యకు పాల్పడ్డం కలవరపెడుతోంది.
- Advertisement -