- Advertisement -
3-1తో ముంబయిపై గెలుపు
ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్ 4
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాల్గో సీజన్లో అహ్మదాబాద్ డిఫెండర్స్ మరో విజయం ఖాతాలో వేసుకుంది. జోరుమీదున్న ముంబయి మీటియర్స్పై 12-15, 15-7, 15-12, 21-20తో నాలుగు సెట్ల మ్యాచ్లో అహ్మదాబాద్ డిఫెండర్స్ గెలుపొందింది. అహ్మదాబాద్ ఆటగాడు నందగోపాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ విజయంతో అహ్మదాబాద్ డిఫెండర్లు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. సీజన్లో తొలి పరాజయం చవిచూసిన ముంబయి మీటియర్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది.
- Advertisement -