నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో మత్తు పదార్థాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే.రాజన్న మత్తు పదార్థాల వినియోగం వలన జరిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల భవిష్యత్తు చిన్నభిన్నమవుతుందని, వాటికి దూరంగా ఉండి ఉజ్వలమైన భవిష్యత్తును కాపాడుకోవలసిందిగా విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల సమాజంలో నేరాల సంఖ్య పెరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.డ్రగ్స్ సేవించిన వ్యక్తి తనను తాను మరిచిపోయి తప్పుడు ఆలోచనలతో నేరాలకు పాల్వడమే కాకుండా, వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై పాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందన్నారు.
యువత మాదక దవ్యాలకు అలవాటు పడి ఆరోగ్యంతో పాటు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడినవారు విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిల్లో అఘైత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మహమ్మారి ఎందరో జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత దేశంగా, రాష్ట్రంగా, జిల్లాగా మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులు అందరితో పాఠశాల ఆవరణలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిరిమల్లె దేవన్న, కిషన్ గౌడ్, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.