- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఏపీలో పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయని ఎస్ఎస్సి బోర్డ్ శుక్రవారం ప్రకటించింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్ , 25న ఫిజిక్స్ , 28న ఎన్ ఎస్ , 30న సోషల్, 31న ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్-2), ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సీ సెకెండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
- Advertisement -



