- Advertisement -
నవ తెలంగాణ – హైదరాబాద్
గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ నికర లాభాలు 53.5 శాతం పెరిగి రూ.390 కోట్లకు చేరాయి. 2024-25కు గాను తుది డివిడెండ్ కింద ప్రతీ ఈక్విటీ షేర్పై రూ.10 డివిడెండ్ను ప్రకటించింది. ఇందుకు రికార్డ్ తేదిని 2025 ఆగస్టు 19గా నిర్ణయించింది. గడిచిన క్యూ4లో కంపెనీ రెవెన్యూ 13 శాతం పెరిగి రూ.5,592 కోట్లుగా చోటు చేసుకుంది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.4,944 కోట్ల రెవెన్యూ ఆర్జించింది.
- Advertisement -