- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు ఓటు వేసి మద్దతు తెలిపాలని 17వ వార్డు అభ్యర్థి చేన్న స్వాతి మహేష్ కోరారు. సోమవారం 17వ వార్డు సమావేశంలో వారు మాట్లాడారు. మీరు వేసే ఓటు ఐదు సంవత్సరాలు భవిష్యత్తును నిర్ణయిస్తుందని, అభివృద్ధి కోసం పాటుపడే అభ్యర్థిని గెలిపించాలని, గత ఐదు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి, 17 వ వార్డును అన్ని విధాల అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మరొకసారి తమకు అవకాశం ఇస్తే ఆదర్శవంతమైన తీర్చిదిద్దుతానని తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
- Advertisement -



