- Advertisement -
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని అడవి దేవులపల్లి కేజిబివి పాఠశాలలో ఖాళీగా ఉన్న అటెండర్ (మహిళ) పోస్ట్ భర్తీకి దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు పాఠశాల ఎస్ ఓ నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈ నెల 18వ తేది వరకు అడవిదేవులపల్లి లోని కె జి బి వి పాఠశాలలో తమ దరఖాస్తులు సమర్పించాలని కోరారు. నిబంధనల ప్రకారం ఎంపిక ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
- Advertisement -



