- Advertisement -
నవతెలంగాణ-భూపాలపల్లి
భూ సమస్యల పరిష్కారం కొరకే దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని భూపాలపల్లి తహసిల్దార్ వి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గురువారం భూపాలపల్లి మండలం గొల్ల బుద్ధారం, దూదేకులపల్లి గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ భారతి కార్యక్రమంలో భాగంగా రైతుల భూమి సమస్యలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ అంజలి రెడ్డి, ఆర్ ఐ లు రామస్వామి, హజారుద్దీన్, సర్వేయర్ శ్రీనివాసరావు జూనియర్ అసిస్టెంట్ లు రాజ్యలక్ష్మి, రజిత, రాజు తదితరులు ఉన్నారు.
- Advertisement -