- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఖాళీగా ఉన్న పోస్టులను అతిథి అధ్యాపకులతో భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కే .అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తేదీ 02/09/2025 మంగళవారం లోగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద కళాశాల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులు అర్హత. పీహెచ్డీ/ సెట్/ నెట్/ఉద్యోగ అనుభవం గల వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు . తేదీ 03/09/2025 బుధవారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డి లో డెమో మరియు ఇంటర్వ్యూ ఉంటుందని ప్రిన్సిపాల్ తెలియజేశారు.
- Advertisement -