- Advertisement -
– కమ్మర్ పల్లి కేజీబీవీ ప్రత్యేక అధికారిని గంగామణి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్పాట్ అడ్మిషన్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కమ్మర్ పల్లి కేజీబీవీ ప్రత్యేక అధికారిని గంగామణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఆరో తరగతిలో 6 సీట్లు, ఏడో తరగతిలో 5 సీట్లు, 8వ తరగతిలో 2సీట్లు ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు.స్పాట్ అడ్మిషన్స్ కి ఆసక్తి గల అభ్యర్థులు కమ్మర్ పల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఈనెల 30, 31 తేదీలలో రిపోర్ట్ చేయాలని కేజీబీవీ ప్రత్యేక అధికారిని గంగామణి ప్రకటనలో తెలిపారు.
- Advertisement -