నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్ లో ఖాళీగా ఉన్న ఫిజిక్స్ అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డా.జె.సంగీత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు పీజీ సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులు కలిగి ఉండాలన్నారు . ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు కలిగి ఉన్నా అర్హులేనన్నారు. నెట్, సెట్, పీ హెచ్ డి కలిగిన వారికి, బోధనా అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 6వ తేదీ,శనివారంలోగా కళాశాలలో దరఖాస్తులు సమర్పించి, 8వ తేదీ సోమవారం జరిగే డెమోకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు . పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని పేర్కొన్నారు.
ఫిజిక్స్ అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులకు ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES