కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ రెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు, నవంబర్ 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కాలేజీ ప్రిన్సిపాల్ డా. రమేశ్ రెడ్డి కోరారు. రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లొమా ఇన్ మెడికల్ అనేస్తేసియా టెక్నాలజీ , డిప్లొమా ఇన్ ఈసిజి టెక్నీషియన్ కోర్సుల్లో ప్రవేశం కొరకు ఇంటర్ బైపీసీ, ఎంపీసీ లలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకవాలని , వీరి తదుపరి ఇతర ఇంటర్మీడియేట్ కోర్సుల విద్యార్థులుకు కూడా అవకాశం కల్పిస్తామని, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు కాలేజీ వెబ్సైట్ www.gmcyadadri.org సంప్రదించాలని కోరారు. పారామెడికల్ బోర్డు వెబ్సైట్:: www.tgpmb.telangana.gov.in వెబ్సైట్లను Contact No. 040-24653519 ఫోన్ నెంబరు సంప్రదించాలని కోరారు.
యాదాద్రి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దరఖాస్తుల ఆహ్వానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



