నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలోని రైతులు 05.06.2025 నాటికి భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న అర్హత కలిగిన రైతులు రైతు భరోసాకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి రమేష్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. భూములు రిజిస్ట్రేషన్ అయినవారు అర్హులుగా గుర్తించి మండలంలో మొత్తము 290 మంది దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నట్లు ఆయన తెలిపారు. క్లస్టర్ల వారిగా వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పునుంతల 58. వెల్టూరు 57. పెనిమెల్ల 35. మామిళ్ళపల్లి 45. గట్టుకడిపల్లి 29. మర్రిపల్లి 24. పిరాట్యానిపల్లి 42. పైన తెలుపబడినటువంటి క్లస్టర్ల విధంగా తమ తమ ఏఈఓ లకి దరఖాస్తు ఫారాలని జూన్ 20వ తారీకు వరకు అందజేయాలని ఆయన కోరారు.కావలసిన పత్రాలు 1.దరఖాస్తు ఫారం,2.ఆధార్ కార్డు, 3.బ్యాంకు అకౌంట్, భూమి పుస్తకము జిరాక్స్ లు సమర్పించాలని రైతులను కోరారు.
రైతు భరోసా కొరకు దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES