Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు భరోసా వానాకాలం 2025 కు దరఖాస్తులు: ఏ ఈ ఓ స్వామ్య

రైతు భరోసా వానాకాలం 2025 కు దరఖాస్తులు: ఏ ఈ ఓ స్వామ్య

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
వానాకాలం 2025 కొత్తగా భూమి కొనుగోలు చేసుకుని పట్టాలు పొందిన రైతులు కట్ ఆఫ్ తేదీ 5 ,6 ,2025 తేదీ నాటికి పట్టాలు పొందిన రైతులు దరఖాస్తులు చేసుకోవచ్చని మద్నూర్ ఎఇఓ స్వామ్య ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతులు తమ డాక్యుమెంట్స్ చివరి తేదీ 20,6 ,2025 లోపు ఏ ఈ ఓ కు సమర్పించాలని కొత్త రైతులను కోరారు. కావలసిన డాక్యుమెంట్స్ రైతు భరోసా దరఖాస్తు ఫారం పట్టా పొందిన జిరాక్స్ కాపీ రైతు ఆధార్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అందించవలసి ఉంటుందని కట్ ఆఫ్ తేదీ వరకు కొత్తగా పట్టాలు పొందిన రైతులు రైతు భరోసా వానాకాలం 2025 కు అర్హులని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -