– బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి..
నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని భూపతి సర్వేలు నిర్వహించిన సదస్సులో వచ్చిన 364 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వాటి సమస్యలు పరిష్కరించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. మంగళవారం జుక్కల్ మండలం తాసిల్దార్ కార్యాలయానికి ఆకస్మికంగా వచ్చిన సబ్ కలెక్టర్ మండలంలో నెలకొన్న పలు రెవెన్యూ, భూ సమస్యల గురించి తాసిల్దార్ హేమలతతో చర్చించారు. ఇటీవల నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో నిర్వహించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మండలంలోని పలు గ్రామాలలో భూ సమస్యలు అత్యధికంగా ఉన్నాయని వాటిని పరిష్కరించే దిశగా రెవెన్యూ శాఖ కృషి చేయాలని తెలిపారు.
రెవెన్యూ సదస్సులో మొదటగా పట్టా పాస్ పుస్తకంలో దొర్లిన తప్పులు వాటికి సంబంధించిన దరఖాస్తులను సరిచేయాలని అట్టి పనిని తొందరగా వెన్ వెంటనే ప్రారంభించాలని తాసిల్దార్ కు సూచించారు. రెండవ దశలో భూముల వివాదాలు సంబంధించిన సర్వేలు వంటి వాటిని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వాస్తవమైన లబ్ధిదారుల ఎవరున్నారో సర్వే చేసి గుర్తించి, క్షేత్రస్థాయి పరిశీలన చేసి నిజమైన దరఖాస్తుదారులకు న్యాయం చేయాలని, తప్పుడు సమాచారంతో దరఖాస్తులు పెట్టిన వాటిని పక్కన పెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ తో పాటు ఆర్ఐ రామ్ పటేల్, జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము, కంప్యూటర్ ఆపరేటర్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.