నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం) : కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు 2025 సెషన్ కోసం ఎన్సీవీటీ ప్యాట్రన్ కింద వివిధ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కోపా, డ్రాఫ్టస్మన్ సివిల్, ఎలక్ట్రి షియన్, ఫిట్టర్ ట్రేడర్స్లో సీట్లు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 21 వరకు దర ఖాస్తు గడువు ఉందని ఆసక్తి గల అర్హులైన విద్యార్థులు తమ ఓర్జినల్ సర్టిఫికెట్స్ స్కాన్ చేసి, రూ.100 చెల్లించి ఆన్లైన్ http//it.telangana.govIn వెబ్సైట్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవ కాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఐటీఐ కళాశాలలో దరఖాస్తుల ఆహ్వానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES