- Advertisement -
కేజీబీవీ ఎస్ ఓ సుమలత
నవతెలంగాణ – నెల్లికుదురు: మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో పిజిసి ఆర్టి అగ్రికల్చర్ పోస్ట్ కు దరఖాస్తు స్వీకరించబడుతున్నాయని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కేజీబీవీ ఎస్ఓ సుమలత తెలిపారు. ఈ సందర్బంగా గురువారం ఆమె మాట్లాడుతూ.. కేజీబీవీ పాఠశాలలో ఇంటర్మీడియట్ ఈ సంవత్సరం అవకాశం వచ్చినందున, వారికి బోధించేందుకు పీ జీ సీ ఆర్ టి అగ్రికల్చర్ మహిళ ఉపాధ్యాయులకు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. బిఎస్సి, అగ్రికల్చర్, ఎంఎస్సీ, అగ్రికల్చర్ చేసిన వారికి అర్హత ఉందని అన్నారు. కావున కేజీబీ పాఠశాలలో ఈనెల 20వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. పూర్తి వివరాలకు ఎస్ ఓ ను సంప్రదించాలని సూచించారు.
- Advertisement -