- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో గ్రూప్-2 విజేతలకు నియామకపత్రాలు అందించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 18న మాదాపూర్లోని శిల్పకళావేదికలో నియామకపత్రాలు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ రామకృష్ణారావు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో సీఎస్ ఈ విషయమై అధికారులతో సమీక్షించారు.
- Advertisement -