Saturday, June 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్తీ దవాఖానాల్లో నూతన వైద్యుల నియామకం

బస్తీ దవాఖానాల్లో నూతన వైద్యుల నియామకం

- Advertisement -

నవతెలంగాణ – కంటేశ్వర్ : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలోని బస్తీ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నియమించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ తెలియజేశారు. గతంలో జరిగిన నియామకాల్లో నాగారం, ఖానాపూర్ బస్తీ దావకానలలో ఇద్దరు రాజీనామా చేయగా, ఇంకొకటి బోధన్ లో నూతనంగా మంజూరు అయినది కాగా మొత్తం మూడు వైద్యాధికారుల పోస్టులకు ముగ్గురిని ఎంబిబిఎస్ అర్హత గల వారిని నియమించినట్లు తెలిపారు. వీరిలో డాక్టర్.రేణి మనీష్ కుమార్ గారిని (ఖానాపూర్) , డాక్టర్ టి ఆర్ శ్రావణ లక్ష్మి (బోధన్) డాక్టర్ మహమ్మద్ షాదాబ్ (నాగారం) బస్తీధవాకానాలలో పనిచేసే విధంగా నియామక పత్రాలు అందజేసినట్లు వైద్యాధికారిని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా ప్రతిరోజు విధులకు హాజరవుతూ సమయపాలన పాటించాలని సూచించారు. బస్తీ ధవాకానకు వచ్చే వారు ముఖ్యంగా పేద ప్రజలు ,కూలీలు మురికివాడల్లో నివసించే ప్రజలని వారి ఆరోగ్యం కోసం పాటుపడాలనీ ఈ సందర్భంగా తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -