- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో రెండ్రోజుల్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం క్లస్టర్లవారీగా 9 మంది నోడల్ అధికారులను నియమించింది. TGSEC కార్యదర్శి లింగ్యానాయక్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. సోమవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నోడల్ అధికారులు అందుబాటులో ఉండనున్నారు. ఎన్నికలపై ఎవరైనా ఫోన్ ద్వారా 9247597066 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని, అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నోడల్ అధికారులను ఆదేశించారు.
- Advertisement -



