- Advertisement -
– పందిల్ల సర్పంచ్ తోడేటి రమేష్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని పందిళ్ళ గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయం వద్ద గ్రామ సర్పంచ్ తోడేటి రమేష్ సోమవారం మేడారం జాతర సందర్భంగా తిరుగు ప్రయాణ భక్తులకు కోసం విడిది ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల నుండి గ్రామస్తులు మేడారం నుండి వచ్చే భక్తులు విడిది ఏర్పాటు చేసుకొని ఎదురుపిల్లను చేస్తారని తెలిపారు. భక్తులందరూ సహపంతి వనభోజనాలు చేసి ఇంటికి తిరుగు ప్రయాణం చేసేవారు కాబట్టి భక్తుల అవసరార్థమై ఎల్లమ్మ దేవాలయం వద్ద ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోడేటి రమేష్ తో పాటు వార్డ్ మెంబర్స్ మరియు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



