- Advertisement -
హైదరాబాద్: ప్రముఖ బ్రాండ్ అరుణ్ ఐస్క్రీమ్స్ హైదరాబాద్లో సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను సృష్టించింది. ఒకే వేదికపై ఏకంగా 5,113 మంది పిల్లలతో అతిపెద్ద ఐస్క్రీమ్ సోషల్ పార్టీని నిర్వహించి ఈ ఘనత సాధించింది. నగరంలోని విద్యార్థులంతా కలిసి 30 నిమిషాల పాటు ఐస్క్రీమ్స్ను ఆస్వాదించి ఈ రికార్డు నెలకొల్పారు. గతంలో 2019లో ఇటలీలో 962 మందితో నమోదైన రికార్డును అరుణ్ ఐస్క్రీమ్స్ భారీ మెజారిటీతో అధిగమించిందని హాట్సన్ అగ్రో ప్రోడక్ట్ లిమిటెడ్ చైర్మెన్ ఆర్జి చంద్ర మోగన్ పేర్కొన్నారు. నాణ్యమైన ఐస్క్రీమ్స్తో పిల్లలకు ఆనందాన్ని పంచుతూ అంతర్జాతీయ స్థాయిలో ఈ మైలురాయిని అందుకోవడం గర్వంగా ఉందన్నారు.
- Advertisement -



