- Advertisement -
న్యూఢిల్లీ : ప్రముఖ టెక్ సంస్థ మెటా తన భారత వ్యాపార విభాగం మేనేజింగ్ డైరెక్టర్, హెడ్గా అరుణ్ శ్రీనివాస్ను నియమించింది. జులై 1న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని సంస్థ తెలిపింది. 2020లో మెటాలో చేరిన ఆయన ప్రస్తుతం కంపెనీ భారత వ్యాపార ప్రకటనలకు డైరెక్టర్గా సేవలం దిస్తున్నారు. మెటా వ్యాపార దీర్ఘకాలిక వృద్ధికి, కంపెనీని మరింత సమర్థం గా ముందుకు నడిపించేందుకు అరుణ్ శ్రీనివాస్ నియామకం ఉపకరిస్తుం దని ఆ సంస్థ పేర్కొంది. గతంలో హిందుస్థాన్ యూనిలీవర్, రీబాక్, ఓలా, పెట్టుబడి సంస్థ వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్ వంటి కంపెనీలలో సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో మూడు దశాబ్దాల పాటు పని చేసిన అనుభవం ఉంది.
- Advertisement -