సుధీర్ బాబు, బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’.
అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివత్తాలతో ఇటీవల రిలీజైన టీజర్ నేషనల్ వైడ్గా వైరల్ అయ్యింది అని మేకర్స్ తెలిపారు.
తాజగా మేకర్స్ ఒక కీలకమైన కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. శోభగా శిల్పా శిరోద్కర్ని పరిచయం చేశారు. ఈ ఫస్ట్లుక్ పోస్టర్ మొత్తం మిస్టికల్ ఎనర్జీతో తాంత్రిక శక్తులని సింబలైజ్ చేస్తోంది. శిరోద్కర్ ఇచ్చిన ఇంటెన్స్, సీరియస్ ప్రెజెన్స్ సినిమా సూపర్ నేచురల్, స్పిరిచువల్ టోన్కి పర్ఫెక్ట్గా సూట్ అయింది.
జీ స్టూడియోస్, ప్రెర్ణా అరోరా ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాను ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రెర్ణా అరోరా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మ్యూజిక్ జీ మ్యూజిక్ కో., క్రియేటివ్ డైరెక్షన్ దివ్య విజరు. జీ స్టూడియోస్ స్ట్రాటజిక్ విజనరీ ఉమేష్ కుమార్ బన్సాల్ మద్దతుతో ప్రొడ్యూసర్స్ శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అర్నుణ అగర్వాల్, శిల్ప సింగాల్, కో-ప్రొడ్యూసర్స్ అక్షరు కేజ్రివాల్, కుస్సుం అరోరా ఈ ప్రాజెక్ట్కు మద్దత్తు ఇస్తున్నారు. ‘టాయిలెట్: ఎక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్మాన్’, ‘పరి’ వంటి హిట్స్ ఇచ్చిన ప్రెర్ణా అరోరా మళ్లీ హై-కాన్సెప్ట్ సినిమాను రూపొందిస్తున్నారు.
విజనరీ టీమ్, అద్భుతమైన కాన్సెప్ట్తో ‘జటాధర’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ థియేట్రికల్ రిలీజ్లలో ఒకటిగా వస్తోంది. దేశవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా భారతీ సినిమాలో నెక్స్ట్ మైథాలజికల్ ఎపిక్ కానుందనే ఆశాభావాన్ని మేకర్స్ వ్యక్తం చేశారు.
‘జటాధర’లోశోభగా..
- Advertisement -
- Advertisement -