– కమ్యూనిస్టులుంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది
– తెలంగాణలోనూ సీజ్ఫైర్ ప్రకటించాలి
– ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపండి
– మావోయిస్టులతో కేంద్రం బేషరతుగా చర్చలు జరపాలి : పీస్ డైలాగ్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
”ఆర్థిక అసమానతలున్నంత కాలం ఉద్యమా లుంటాయి. కమ్యునిస్టులుంటేనే ప్రజాస్వామ్యం బతుకు తుంది. అపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలి. సీజ్ఫైర్ ప్రకటించి మావోయిస్టులతో బేషరతుగా చర్చలు జరపాలి” అని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లోని సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో ‘పీస్ డైలాగ్ కమిటీ’ ఆధ్వర్యంలో కగార్ ఆపరేషన్, శాంతిచర్చల అంశంపై ఆ సంఘం సభ్యులు అన్వర్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మాట్లాడుతూ చత్తీస్గఢ్ అడవుల్లో కగార్ ఆపరేషన్ పేరిట అమాయక గిరిజనులను కాల్చి చంపు తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతం నుంచి ఆదివాసీ లను, నక్సలైట్లను ఏరివేసి, అక్కడున్న ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకే మోడీ సర్కార్ ఈ మారణహోమానికి పాల్పడుతోందని విమ ర్శించారు. 2026 కల్లా దేశంలో మావోలను ఏరివేస్తామని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటించడాన్ని అయన ఎద్దేవా చేశారు. ఆర్థిక, సామాజిక అసమానతలున్నంత వరకు సమాజంలో ఉద్యమాలు పుట్టుకొస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. పహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాద దాయాది దేశమైన పాకిస్తాన్తో చర్చలు జరిపిన కేంద్రం, దేశ పౌరులైన మావోలతో ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ పేరిట చేస్తున్న హత్యాకాండను ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ కమ్యునిస్టులుంటేనే దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం బతుకుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ హింసకు వ్యతిరేకమనీ, గతంలో తమ సర్కార్ హయాం లోనే నక్సల్స్తో చర్చలు జరిపామని గుర్తుచేశారు. మావోలు స్వయంగా చర్చలకు పిలుపునిస్తే, వారి ప్రతిపాదనలను పక్కన పెట్టి, నక్సల్స్తో పాటు అమాయక గిరిజనులను కేంద్రం వెంటాడి చంపుతోందని విమ ర్శించారు. మోడీ సర్కార్ ఫాసిస్టు పద్దతుల్లో హింస ద్వారానే అన్నింటిని గెలుస్తామనే బ్రమల్లో ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు కాంగ్రెస్ అధి ష్టానంతో మాట్లాడి రాష్ట్రంలో సీజ్ ఫైర్పై తమ పార్టీ అభిప్రాయం చెబుతామని అన్నారు. ఎన్కౌంటర్ల పేరిట మావోయిస్టులను, గిరిజనులను చంపడం రాజ్యాంగానికి వ్యతిరేకమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. ఈ హింసాకాండలో ఇరువైపుల నుంచి పేద, మధ్యతరగతి ప్రజలే చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణను ప్రకటించి మావోలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రంలోని మోడీ సర్కార్ హింసాకాండకు పాల్పడుతోందని విమర్శించారు. శాంతి చర్చల కోసం మావోలు చేసిన ప్రతిపాదనను ఎందుకు తిరస్కరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. విసృత ప్రజా ఉద్యమాల ద్వారా అన్ని పార్టీలు ఏకమై మావోలతో చర్చలకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ నక్సల్స్ ఏరివేత పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలపై యుద్దం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ యేతర ఎంపీలు, ఇతర ప్రజా ప్రతిని ధులను కలిసి మోడీ సర్కార్పై ఒత్తిడి తేవాలని అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో వివిధ సంఘా లతో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ అధ్వర్యంలో ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను కలిసి మద్దతు కోరామని తెలిపారు. పాలకులు, పెట్టుబడి దారుల చేతుల్లో కీలుబొమ్మలుగా ఉన్నారనీ, వారిని కాదని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఈ దేశంలో లేదని అన్నారు.. న్యూడె మోక్రసీ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. పీస్ డైలాగ్ కమిటీ అధ్యక్షులు జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ వివిధ ప్రజా సంఘాలు, పార్టీల అభిప్రాయాల మేరకు ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆపరేషన్ కగార్ను ఆపాలనీ, మావో యిస్టులతో వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి ఈ నెల ఆరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతామని వివరించారు, 14న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాస్వామ్య వాదులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్య క్రమంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలకు చెందిన కందిమల్ల ప్రతాపరెడ్డి, హన్మేష్, గోపినాధ్, గడ్డం లక్ష్మన్, జీవన్కుమార్, నాగిరెడ్డి, అనంతరెడ్డి, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక అసమానతలున్నంతకాలంఉద్యమాలుంటాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES