నవతెలంగాణ – ఆలేరు టౌను
మీకు ఇచ్చిన మాట ప్రకారం బహుదూర్ పేటను యాదావిధిగా గ్రామపంచాయతీగా చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య అన్నారు. ఆలేరు మున్సిపాలిటీ వద్దు.. బహుదూర్ పేట గ్రామపంచాయతీ ముద్దు.. అని కోరుతూ బహదూర్పేట ప్రజల నిరవధిక నిరసన దీక్షలు గత నాలుగు రోజుల నుండి చేపట్టగా.. వారికి మొబైల్ ఫోన్లో సోమవారం తెలియజేశారు.
ఆలేరు మున్సిపాలిటీ ఏర్పాటు నుండి, పక్కనే ఉన్న బహుదూర్పేట గ్రామాన్ని సైతం మున్సిపాలిటీలో బిఆర్ఎస్ ప్రభుత్వం విలీనం చేసింది. విలీనం చేసిన నాటినుండి బహదూర్పేట గ్రామాన్ని తిరిగి ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు అందజేశారు.
2023 డిసెంబర్ శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పంచాయతీగా ఏర్పాటు చేస్తానని, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ .. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో బహదూర్పేటను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని, గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీలో విలీనం చేసిన తర్వాత ,అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి ఉందని అన్నారు.
ఉపాధి అవకాశాలు లేక గ్రామ ప్రజలు బతుకుతెరువు కోసం హైదరాబాద్కు వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు. మున్సిపాలిటీలో చేరిన తర్వాత ఇంటి పన్ను, నల్ల పన్నుల భారం భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేకు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి, జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు అందజేశామని, అయినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు తమ గ్రామాన్ని చిన్నచూపుగా చూస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే హామీతో కమిటీ సభ్యులు దీక్ష విరమించారు
ఈ కార్యక్రమంలో వి.శ్రీనివాస్, కె సంపత్, వి.మల్లేశం, రాములు, డి.సరేష్, ఎం విజయ్,పి నరేశ్, జె అంజయ్య, కె సాయిలు, వి.బాలనరయ్య, కె నరేశ్, హరి ప్రసాద్, డి రాము, బి సంపత్, మహిళా లు బాలమ్మ, యాదమ్మ, పద్మ, రేణుక, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.



