- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.45 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. ఈ నెల 20న బడ్జెట్ను భట్టి ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి కొత్త హాల్లో శాసనమండలి కొలువుదీరనుంది. నేడు గవర్నర్, సీఎం చేతుల మీదుగా అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
- Advertisement -



