Saturday, August 2, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఆదివాసి సేన మండల ఆధ్యక్షునిగా అత్రం శ్రీకాంత్..

ఆదివాసి సేన మండల ఆధ్యక్షునిగా అత్రం శ్రీకాంత్..

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హత్నూర్
ఆదివాసి సేన మండల కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని మడగూడ గ్రామంలో ఆదివాసి సేన మండల కమిటీ నూతన కార్యవర్గాన్ని మడగూడ గ్రామ పటేల్, మడగూడ రాయి సెంటర్ రాయి సెంటర్ సార్మేడి ఆధ్వర్యంలో ఆదివాసి సేన జిల్లా ఆధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్ ఆధ్యక్షతన ఆదివాసి సేన నాయకులతో మడ గూడ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి అదివాసి సేన మండల నూతన కమిటీ ఎన్నుకున్నారు.

ఆదివాసి సేన మండల కమిటి ఆధ్యక్షులుగా అత్రం శ్రీకాంత్(ధరంపూరి), మండల ఉపాధ్యక్షులుగా అత్రం రవి (కోత్తపల్లి), మండల ప్రధాన కార్యధర్శిగా గేడం సోనేరావు(మడగూడ), సంయుక్త కార్యధర్శిగా ఉయిక నాందేవ్ (చింతల్ సాంగ్వీ), కోశాధికారిగా ఆత్రం నాగోరావు(తుకాన్ పల్లి), మండల కమిటి సభ్యులుగా మడవి నగేష్, కనక శంకర్, అత్రం తెలంగ్ రావు, మడవి శంకర్, అనక లక్ష్మన్, కోరెంగ రాజు, అత్రం మనోజ్, అత్రం ఓం ప్రకాశ్, అర్క వమాన్ రావు, అత్రం నవనీత్ , 

మొత్తం 15 మందితో ఆదివాసి సేన మండల కమిటిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కోవ దౌలత్ రావు మొకాశి, ఆదివాసి సేన జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్, ఆదివాసి సేన జిల్లా ఉపాధ్యక్షులు ఉయక శ్యాంరావ్, మండడి లక్ష్మణ్, అడేం పోల్లన్న,  కోట్నక గణేష్, దుర్వ కోసేరావు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -