- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జగిత్యాల జిల్లా లక్ష్మిపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య సతవ్వపై అనుమానంతో భర్త మల్లయ్య గొడ్డలితో ఆమెను అత్యంత దారుణంగా నరికి చంపేశాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని అవమానపరిచేలా ఆమె ప్రైవేట్ పార్టులో కర్ర గుచ్చినట్లు సమాచారం. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు మల్లయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
- Advertisement -



