- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తర నైజీరియాలోని నైజర్ రాష్ట్రంలో శనివారం సాయంత్రం దుండగులు కసువాన్ – డాజీ గ్రామంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా, మరికొందరిని అపహరించుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 37 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- Advertisement -



