- Advertisement -
నవతెలంగాణ జన్నారం
జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న కోమటి రాజన్న గుండెపోటుతో మృతిచెందారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రాజన్నకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతిచెందారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రాజన్న ఎంపీడీవో కార్యాలయంలో పది సంవత్సరాలుగా అటెండర్గా సేవలందిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మృతిపై అధికారులు సంతాపం తెలిపారు.
- Advertisement -



