Thursday, May 15, 2025
Homeఆటలుప్రి క్వార్టర్స్‌కు ఆకర్షీ, ఉన్నతి

ప్రి క్వార్టర్స్‌కు ఆకర్షీ, ఉన్నతి

- Advertisement -

– థాయ్‌లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
బ్యాంకాక్‌:
థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌-300 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి ఆకర్షీ కశ్యప్‌, ఉన్నతి హుడా ప్రవేశించారు. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో ఆకర్షీ కశ్యప్‌ మూడుసెట్ల హోరాహోరీ పోరులో 21-16, 20-22, 22-20తో ఎగ్జిన్‌ సుగియామా(జపాన్‌)పై విజయం సాధించింది. 17ఏళ్ల ఆకర్షీ తొలి గేమ్‌ను సునాయాసంగా చేజక్కించుకున్నా.. రెండో గేమ్‌ను ముగించడానికి చెమటోడ్చాల్సి వచ్చింది. ఇక ఉన్నతి హుడా 21-14, 18-21, 23-21తో నితిత్‌కరారు(ఇండోనేషియా)పై చెమటోడ్చి నెగ్గింది. మరో పోటీలో సంతోష్‌ రామ్‌రాజ్‌ 19-21, 7-21తో 8వ ర్యాంక్‌ క్రీడాకారిణి, సింగపూర్‌కు చెందిన యో-జి-మిన్‌ చేతిలో ఓటమిపాలైంది. ఇక మాల్విక బన్సోద్‌ 21-12, 13-21, 21-17తో సింగపూర్‌కు చెందిన నిషిహాన్‌పై పోరాడి గెలుపొందగా.. అనుపమ ఉపాధ్యాయ 11-21, 9-21తో 7వ ర్యాంకర్‌ థారులాండ్‌కు చెందిన ఇంటనాన్‌ చేతిలో ఓటమిపాలైంది. ఇక పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. ప్రధాన టోర్నీకి అర్హత సాదించిన తరుణ్‌ మన్నేపల్లి, స్టార్‌ షట్లర్లు లక్ష్యసేన్‌, ప్రియాన్షు రాజ్‌వత్‌ తొలిరౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -