- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రములోని అంగడి బజారులో ఉన్న గ్రామ పంచాయతికి సంబందించిన కామర్షియల్ కంప్లెక్స్ లోని దుకాణాలకు ఈనెల 24న వేలం పాట వేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ఆరు గదులకు టెండర్లు కావలసి ఉన్నాయని, 2026-27 సంవత్సరాలకు గాని టెండర్లు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. బహిరంగ టెండర్లల్లో పాల్గొనాలనుకునే వారు తగిన రుసుము పంచాయతీ కార్యాలయంలో జమచేయాలని తెలిపారు. మరింత సమాచారం కొరకు పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
- Advertisement -



