Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైబర్ క్రైమ్ పై పాఠశాలలో అవగాహన..

సైబర్ క్రైమ్ పై పాఠశాలలో అవగాహన..

- Advertisement -

నవతెలంగాణ – ( వేల్పూర్ )ఆర్మూర్
మండలంలోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుకునూరులో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు టి. హరిచరణ్  అధ్యక్షతన సైబర్ క్రైమ్ గురించి గురువారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సబ్ డివిజన్ షీ టీం కానిస్టేబుళ్లు విగ్నేష్, సుమతి హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినిలు, ఉద్యోగినిలు, మహిళలు ఈవ్‌టీజింగ్‌, వేధింపులకు గురైతే పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసిన షీ టీంకు సమాచారం అందివ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన మహిళలు, విద్యార్థినిల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.

ఈవ్‌ టీజింగ్‌కు గురయ్యేవారు భయపడకుండా సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామన్నారు. షీ టీం  సెల్ నెంబర్‌. 8712659795 కు, డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా షీ టీం వారికి ఫిర్యాదు చేసే విధానాన్ని మహిళలకు వివరించారు. విద్యార్థినులకు ఈవ్ టీజింగ్ , మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అనే అంశం పైన  చక్కగా అవగాహన కల్పించిన కానిస్టేబుళ్లు  లను పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు  ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో ,ఉపాధ్యాయ బృందం చరణ్ దాస్, నాగరాజు, హరిత, శ్రీధర్ రావు మల్కన్నా,పతాని గంగాధర్, రవీంధర్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -