- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా సిపి గారి ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్ లకు, ద్విచక్ర వాహన దారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పైన అవగాహన కల్పించామని ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ ఆదివారం తెలిపారు. ఆటో డ్రైవర్లు పరిమితి కి మించి ప్యాసింజర్స్ ను ఎక్కించుకోకూడదు, యూనిఫామ్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



