నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ తో పాటు నిగ్వా ప్రభుత్వ ఉన్నాత పాఠశాలలో ఆర్ టి ఐ సామాజిక కార్యకర్తల ఫోరం తెలంగాణ ఆధ్వర్యంలో బుధువారం పాఠశాల విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర జనరల్ కార్యదర్శి సయ్యద్ కలీం మాట్లాడుతూ.. పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు సమాచార హక్కు చట్టం పై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. దింతో దరఖాస్తు చేసే విధానం మొదటి ఆప్పీలు, రెండవ అప్పీలు ఎలా చేయాలి అనే పరిజ్ఞానం కలిగి ఉంటే పారదర్శకత జవాబుదారీతనం పెరుగుతుందని తెలిపారు.ప్రతి భారతీయ పౌరుడు ఈ సమాచార హక్కు చట్టాన్ని వినియోగించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న పలు సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్ సారంగాపూర్ మండల బాధ్యులు సయ్యద్ ఆబిద్ అలీ ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



